రాఖీ పండుగ వచ్చింది అంటే సోదరుల చేత రాఖీ కట్టించుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తున్నది. రాఖీ కట్టడం వలన సోదరికి సోదరులు అభయం ఇస్తున్నట్టే. నేనున్నాను అనే భరోసా ఇస్తున్నట్టు. రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. అయితే, దేశంలో రాఖీ కట్టిన తరువాత కూడా అనేక మంది తమ సోదరి బాగోగుల గురించి పట్టించుకోకుండా తప్పించుకు తిరిగేవారు చాలామంది ఉన్నారు.
సెలెబ్రిటీలు కూడా ఈ పండుగను అంగరంగ వైభవంగా చేసుకుంటారు. రాఖీ కట్టడం అన్నది ఒక సంప్రదాయం. దానికి కులం మతం ప్రాంతం అన్నది అడ్డుకాదు. అందుకే ప్రతి ఒక్కరు రాఖీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. హీరోయిన్లు తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. రాఖీ పండుగ గురించి రెజీనా కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది.
రాఖి కట్టాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా కానీ, తనతో రాఖీ కట్టించుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. స్కూల్, కాలేజీలో కూడా రాఖీ కడతానంటే అందరుపారిపోయేవారు. హీరోయిన్ అయ్యాక కూడా అలానే పారిపోతున్నారు అని వాపోయింది. ఈసారి ఎలాగైనా రాఖీ కట్టాలని అనుకుంటున్నట్టు రెజీనా చెప్పింది.
ప్రస్తుతం రెజీనా ఎవరు సినిమా చేస్తున్నది. అడవి శేషు హీరో. సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కింది. ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రేప్, మర్డర్ ఆధారంగా సినిమా నడుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ భారీ విజయం సాధించింది. ఈ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
గతంలో వచ్చిన అడవి శేషు గూడాచారి సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలోనే ఈ సినిమాను తెరకెక్కించారు. కాకపోతే ఇది పూర్తిగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 15 వ తేదీ వరకు ఆగాల్సిందే.