జబర్దస్త్ బ్యూటీస్ అట్టర్ ఫ్లాప్..!
తాజాగా రష్మీ నటించిన శివరంజని సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. గత వారం విడుదలైన ఈ సినిమాకు ఒక్కటంటే ఒక్క శాతం కూడా ఓపెనింగ్స్ రాలేదని సినిమా ఎనలిస్టులు చెబుతున్నారు. మొదటి రోజునే థియేటర్ల నుంచి బొమ్మను తీసేశారు. అలా బుల్లితెరపై క్రేజ్ సంపాదించుకున్న ఈ భామా వెండితెరపై షైన్ను నిలబెట్టుకోలేకపోతోంది. అలాగే బుల్లితెరపై పిచ్చ క్రేజ్ ఉన్న భామల్లో అనసూయ ఒకరు. ఒకానొక సమయంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగింది కూడా. క్షణం సినిమాతో చాలా పేరు తెచ్చుకుంది.
ఆ తరువాత వచ్చిన మెగా మూవీ రంగస్థలంతో తన నటనా ఉగ్రరూపాన్ని చూపింది. దివంగత సీఎం వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో చిన్న పాత్రే అయినా, అందులోనూ తన సత్తా చాటింది అనసూయ. దాంతో అనసూయ వెండితెరపై కుదురుకున్నట్లేనని అందరూ భావించారు.గత వారం అనసూయ నటించిన కథనం చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఏకంగా నాగార్జున నటించిన మన్మథుడు -2 చిత్రంతోనే పోటీపడింది. మన్మథుడు -2 విజయాన్ని మూటగట్టుకోలేకపోయినా దాన్ని అనసూయ కథనం క్యాష్ చేసుకోలేకపోయింది. దీంతో సోలో హీరోయిన్గా మెప్పించడం కష్టమేనని అనసూయపై ముద్రపడింది.