నవంబర్ లో స్పై థ్రిల్లర్ 'చాణక్య' !
తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ చాణక్య
. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూవీ మేకర్స్ పాటలను విదేశాల్లో చిత్రీకరించే పనిలో ఉంది. అయితే మరో పక్క ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరిగాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుంది. గోపీచంద్ కూడా తన పాత్రకు సంబధించిన ట్రాక్ కి డబ్బింగ్ చెప్పడటం పూర్తి చేశారట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్ లో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట.
ముఖ్యంగా ఇండో - పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అలాగే విశాల్ చంద్రశేఖర్ సంగీతం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోందట.. అదేవిధంగా ఈ చిత్రానికి వెట్రి అందిస్తోన్న సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చిందని సమాచారం. అయితే ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెంచుకుంటూ పోతున్నారని.. ఇప్పటికే ఈ సినిమాకి 46 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు వచ్చాయి. ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో లాంగ్ షెడ్యూల్స్ షూట్ చెయ్యడం.. పైగా సినిమాలో బడ్జెట్ తో కుడనుకున్న యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండటంతో ఇప్పటివరకూ భారీగానే ఖర్చు అయిందట. దాంతో మొదట 32కోట్ల అనుకున్న బడ్జెట్ కాస్త, ఇప్పుడు 48 కోట్లు దాటేలా ఉందట. మరి గోపీచంద్ పైనా 50 కోట్లు వర్కౌట్ అవుతాయా ? ఇంతకి ఇంత పెద్ద మొత్తం రికవరీ కావాలంటే సినిమాకు బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే. అలాగే రావాలని కోరుకుందాం.