తెలుగు,తమిళ సినిమా పరిశ్రమలో యాక్షన్ కింగ్ అర్జున్ అంటే తెలియని వారుండరు.ఇతను,నటుడు,దర్శకుడు..కోడి రామ క్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన మాపల్లెలో గోపాలుడు చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేశాడు.ఇక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న అర్జున్ సర్జా సినిమాలు,మా పల్లెలోగోపాలుడు, మన్యంలోమొనగాడు, జైహింద్,లై,జెంటిల్మెన్,ఒకే ఒక్కడు,నా పేరుసూర్య-నా ఇల్లు ఇండియా’వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పుడు ఈయన మేనల్లుడు కూడా తెలుగు తెరపై కనిపించబోతున్నాడు..అతనే కన్నడ హీరో ధృవ..ఇతను నటిస్తున్న చిత్రం పేరూ పొగరు..శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్పై బి.కె.గంగాధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో.సెన్సేషనల్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది.ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.కొన్ని రోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.
నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.ఫ్రెంచ్ బాడీ బిల్డర్ మోర్గాన్ అస్తే,అమెరిక్ ఐ.ఎఫ్.బి.బి ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కై గ్రీనే,ఇంటర్నేషనల్ అథ్లెట్ ఎవాల్యు యేషన్ స్పోర్ట్స్ న్యూటీషన్ జాన్ లుకాస్,జర్మన్ ఫిట్నెస్ సెన్సేషన్ జో లిన్డర్ వంటి ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ నటించడం విశేషం..ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ఇందులో హీరో ధృవ సర్జాకు,ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్కు మధ్య జరిగే క్లైమాక్స్,సినిమాకే హైలైట్గా నిలవనుంది.ఇకాభైరవగీత' ఫేమ్ ధనుంజయ ఈ సినిమాలో విలన్గా నటిస్తుండగా.సంపత్ రాజ్,రవి శంకర్,పవిత్రా లోకేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.విజరు మిల్టన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీని ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు..కాస్త అర్జున్ ముఖవళికలు కలిగివున్న దృవ,తన మేనమామ తెలుగు ప్రేక్షకుల్లో ఏర్పరచుకున్న స్దానాన్ని కొల్లగొట్టి ఎంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు చేరువవుతాడో త్వరలోనే తెలుస్తుంది.ఇకపోతే పూర్తిగా ఈ సినిమా నేషనల్ బాడిబిల్డింగ్ బ్యాక్ డ్రాప్లో నటుస్తుందని సమాచారం..