యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బాక్సాఫీస్పై తన పంజా విసిరాడు. రెబల్స్టార్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్కు దేశం అంతటా అనుకున్న టాక్ రాలేదు. టాక్తో సంబంధం లేకుండా సాహో భారీ వసూళ్లు కొల్లగొట్టింది. తొలి ఆటకే సాహోకు నెగిటివ్ టాక్ వచ్చింది. రివ్యూవర్లు అందరూ సినిమాను ఏకిపడేశారు. సాహోపై రిలీజ్కు ముందే కక్షకట్టుకుని కూర్చొన్న బాలీవుడ్ విమర్శకులు కూడా తమ కక్ష తీర్చుకునేలా రేటింగ్లు ఇచ్చారు.
చాలా మంది సాహోకు 1 అంతకంటే తక్కువుగా 0.5 రేటింగ్ ఇచ్చారు. తెలుగులో కూడా సాహోకు 2కు మించి రేటింగ్లు రాలేదు. తొలి రోజు నెగిటివ్ టాక్తో వరల్డ్ వైడ్గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సాహో రెండో కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్లో హిందీ వెర్షన్లో తొలి రోజు కంటే రెండో రోజు సాహోకు ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
సాహో దేశవ్యాప్తంగా తొలి రోజు 24.40 కోట్ల రూపాయల వసూలు చేసింది. శనివారం, ఈ చిత్రం 1 వ రోజు కంటే ఎక్కువ వసూలు చేసి రూ .25.20 కోట్ల నెట్తో ముగిసింది. ఈ చిత్రం 2 రోజులకు గాను ఆల్ ఇండియా మొత్తం నెట్ రూ .49.60 కోట్లు సాధించింది. ఇక ఆదివారం మార్నింగ్ షోలు స్టార్ట్ అయిన వెంటనే రూ.50 కోట్లను క్రాస్ చేయనుంది.
ఆదివారం బాలీవుడ్లో అడ్వాన్స్ బుకింగ్లు కూడా చాలా బాగున్నాయి. మూడో రోజు ఎంత లేదన్నా బాలీవుడ్లో రూ. 20 కోట్లు సులువుగా సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. 3 రోజుల మొదటి వారాంతంలో మొత్తం రూ .70 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ కలెక్షన్లు దాదాపు బాలీవుడ్ అగ్రశ్రేణి తారలతో సమానంగా ఉన్నాయి. ఈ నెగిటివ్ టాక్తో ఈ రేంజులో వసూళ్లు సాధిస్తుండడంతో సాహో బాలీవుడ్లో భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.