పవర్ స్టార్ ను వదిలినా చరణ్ చేరదీశాడట..ఇప్పుడిదే హాట్ టాపిక్..?

Kunchala Govind
 శరత్ మురార్ గురించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. శరత్ నమ్మకానికి పెట్టింది పేరు. వ్యక్తిగతంగా గా కూడా ఎంతో మంచి గుణాలున్నా మనిషని పేరుంది. మాటీవీలో కి వచ్చాక మంచి పేరు సంపాదించి, మెగా ఫ్యామిలీకి దగ్గరై, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి మిత్రుడిగాను దగ్గరయ్యారు. ఆయనతోనే రెండు సినిమాలను కూడా నిర్మించారు. ఒకదశలో పవన్ కు కుడి భుజం శరత్ మరారే అన్నంతగా పేరు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యులతో కూడా పవన్ తరపున శరత్ నే మాట్లాడేవారు కూడా.

నేపథ్యంలో ఎక్కడ తేడా వచ్చిందోగాని...మౌనంగా పవన్ కు దూరం అయ్యారు. పవన్ కు శరత్ దూరం కావడం వెనుక పవర్ స్టార్ తో అనుబంధం వున్న ఒక వ్యక్తి హస్తం వుందని గుసగుసలు వున్నాయి. ఆ వ్యక్తి చాలా తెలివిగా, స్మూత్ గా పవన్ ను శరత్ ను విడదీసారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఏమైనా శరత్ మౌనంగా బయటకు వచ్చి తన వరకు తను డబ్బింగ్ సినిమాలు, డిజిటల్ మీడియా కంటెంట్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.

అయితే లేటెస్ట్ గా తెలిసిన సమాచారం ప్రకారం శరత్ మరార్ ఇప్పుడు మళ్లీ మెగా కాంపౌండ్ లో ప్రత్యక్షం అయ్యారట. కొణిదెల ప్రొడక్షన్స్ లో శరత్ ఇప్పుడు ఆక్టివ్ గా వున్నారని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి విడుదల దగ్గరకు వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వున్నాయి. మార్కెటింగ్ పనులు వున్నాయి. పబ్లిసిటీ వ్యవహారాలు ఇలా చాలా వున్నాయి. ఇవన్నీ చూసుకోవడానికి రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ వున్నారు. అయినప్పటికి శరత్ ను కూడా ఇప్పుడు రామ్ చరణ్ దగ్గరకు తీసినట్లు తెలుస్తోంది.

సైరా సినిమా కి సంబంధించిన చాలా వ్యవహారాలు ఇప్పుడు శరత్ కూడా చూస్తున్నారని తెలుస్తోంది. పవన్ కు దూరమైనా అరవింద్, మెగాస్టార్ ల ప్రోత్సాహంతోనే శరత్ వుంటూ వస్తున్నారు. అంతేకాదు పవన్ కు కూడా ఎక్కడో పాత మిత్రుడి మీద సాఫ్ట్ కార్నర్ వుండి వుండొచ్చునని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే మళ్లీ ఈ రూట్ లో దగ్గరకు తీస్తున్నారేమోనని ఇండస్ట్రీలో ఒక వర్గం వాళ్ళు చెప్పుకుంటున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: