బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న డ్రీం గర్ల్
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద చిచ్చోరె గట్టి పోటీనిస్తుంది. సెప్టెంబర్ 6న విడుదలైనా ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తో ఇప్పటివరకు 83.59కోట్ల షేర్ ను రాబట్టింది. త్వరలోనే ఈ చిత్రం 100కోట్ల మార్క్ ను చేరుకోనుంది. నితీష్ తివారి తెరకెక్కించిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , శ్రద్ధ కపూర్ , నవీన్ పోలిశెట్టి , వరుణ్ శర్మ ,తహీన్ రాజ్ భాసిన్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఇటీవల తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి తన నటనకు ప్రశంసలు పొందిన తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి ఈ చిచ్చోరె లో కూడా అద్భుతమైన నటన కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈచిత్రం తో నవీన్ బ్యాక్ బ్యాక్ టు సక్సెస్ లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నవీన్ తెలుగులో జాతి రత్నం అనే సినిమా లో నటిస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పిట్టగోడ ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేస్తున్నాడు.