సాహో తరువాత పాన్ ఇండియా మూవీ గా విడుదలకానున్న తెలుగు సినిమా... సైరా నరసింహ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. ఇక అతి త్వరలో సెన్సార్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి 177నిమిషాల నిడివిని ఫిక్స్ చేశారు మేకర్స్. మరి దాదాపు 3గంటల నిడివి ఈచిత్రానికి ప్లస్ అవుతుందో లేదో చూడాలి. అయితే ఓ పోరాటయోధుడి చరిత్ర ను చెప్పాలంటే ఆ మాత్రం రన్ టైం ఉండాల్సిందే. కానీ అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చుబెట్టాలంటే ఆ కథను ఆసక్తికరంగా చెప్పాలి. మరి ఈ విషయంలో సైరా టీం ఎంతవరుకు సక్సెస్ అయ్యారో తెలియాలంటే సినిమా విడుదలవరకు ఎదురుచూడాల్సిందే.
ఇదిలా ఉంటే నిన్న విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ అన్నిభాషల నుండి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. అద్భుతమైన విజువల్స్ , డైలాగ్స్ తో ట్రైలర్ కట్ చేసి సినిమా ఫై మరింత గా అంచనాలు పెంచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు , సుధీప్ , నయనతార , తమన్నా ముఖ్య పాత్రల్లో నటించగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ఈ చిత్రం సౌత్ తో పాటు హిందీలోనూ భారీస్థాయిలో విడుదలకానుంది .