టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కష్టాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన దేవిశ్రీ తన ఫామ్ కోల్పోపోవడంతో అతడికి అవకాశాలు పూర్తిగా తగ్గి పోతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీని పోగట్టుకున్న దేవిశ్రీ కి మరోకసారి ఊహించని దెబ్బ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ కూడా దేవిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. కొరటాల ఇప్పటివరకూ దర్శకత్వం వహిస్తున్న అన్ని సినిమాలకు దేవినే మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేవిశ్రీ కొరటాల చిరంజీవితో త్వరలో మొదలు పెట్టబోతున్న మూవీ విషయంలో పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.
ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఈసినిమా కోసం తీసుకుని రావాలని కొరటాల ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇండస్ట్రీలోని టాప్ దర్శకులు అదే విధంగా టాప్ హీరోలు దేవిశ్రీని పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం దేవిశ్రీకి మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ తప్ప మరి ఏ పెద్ద సినిమాలు చేతిలో లేవు.
ఈ మూవీ ట్యూన్స్ విషయంలో దేవిశ్రీ పూర్తి శ్రద్ధపెట్టి ఆ మూవీ ఆడియోను హిట్ చేయలేకపోతే ఇక దేవిశ్రిని రక్షించడం ఎవరి తరంకాదు అని అంటున్నారు. తాను సంగీతం అందించే ప్రతి సినిమాకు కోటి నుండి రెండు కోట్ల వరకు పారితోషికం అందుకునే దీవిశ్రీని ఇప్పుడు టచ్ చేయడానికి కూడ చాల మంది హీరోలు భయపడి పోతున్నారు అని వార్తలు రావడం ఒక విధంగా ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కు కలవరపెట్టే విషయం. అయితే ఒకసారి మళ్ళీ ట్రాక్ లోకి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ను అందుకోవడం ఎవరి వల్లా కాదనీ సాధారణంగా ఇండస్ట్రీలోని దర్శకులకు సంగీత దర్శకులకు ఇలాంటి పరిస్థితి వస్తూనే ఉంటుందని దేవిశ్రీ సన్నిహితులు అంటున్నారు..