టాలీవుడ్ లో ఫ్యామిలీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాలేజ్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో పరిచయం అయ్యాడు నిఖిల్. కెరీర్ బిగినింగ్ లో సోలోగా వచ్చిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. కలర్స్ స్వాతి తో నటించిన స్వామిరారా సూపర్ హిట్ అయ్యింది..దాంతో పాటు నిఖిల్ జాతకం కూడా మారింది. స్వామిరారా సినిమా తర్వాత కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య,ఎక్కడికి పోతావు చిన్నవాడ,కేశవ లాంటి సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో నిఖిల్ హీరోగా మంచి స్థానం సంపాదించాడు.
అయితే గతేడాది రిలీజ్ అవ్వాల్సిన ‘అర్జున్ సురవరం’ ఇప్పటివరకూ ఎన్నోసార్లు రిలీజ్ తేదీలు ప్రకటించి వాయిదా వేసారు. మొదట ఈ మూవీ ముద్ర టైటిల్ తో రిలీజ్ చేయాలని చూశారు. కానీ అప్పటికే జగపతిబాబు నటించిన మూవీ ‘ముద్ర’ రిలీజ్ అయ్యింది. దాంతో కొన్నిరోజులు టైటిల్ పై వివాదం నడిచి ‘అర్జున్ సురువరం’ టైటిల్ మార్చారు. ఈ మూవీ లో నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు..ఆ మద్య టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది ఈ మూవీ రిలీజ్ చేయాలని చూసినా..మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్ ఎండ్ గేమ్ రావడంతో సినిమా వాయిదా వేస్తూ వచ్చారు.
ఇక వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ రిలీజ్ తరువాత అర్జున్ సురవరం రిలీజ్ అవుతుందని తెలిపినప్పటికీ మరోసారి వాయిదా వేశారు. అసలు అర్జున్ సురవరం సమస్య ఏంటి? ఎందుకు పదే పదే వాయిదా వేస్తున్నారు? అని ఆరా తీయగా ఈ సినిమా బిజినెస్ అవ్వడమే పెద్ద సమస్యగా మారిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొంత వరకూ బిజినెస్ జరిగినా నిర్మాతలు సంతృప్తిగా లేరనేది ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కనితన్కు రీమేక్గా తెరకెక్కించారు.