రత్నవేలు కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన పవర్ స్టార్

Rakesh Singu

 మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి బుధ వారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల నుండి మంచి టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సైరా  సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవితం ఆధారంగా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి  సైరాకు దర్శకత్వం వహించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు 300 కోట్ల తో నిర్మించారు.  సైరాకు  సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండి మంచి స్పందన వస్తుంది. కానీ బాలీవుడ్ లో వార్ మరియు   జోకర్   సినిమాలు  సైరా కు గట్టి పోటీ ని ఇస్తున్నాయి.

సైరా సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాపంగా 85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చెసింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 37.60 కోట్లు షేర్ రాబట్టింది..సైరా లో మెగాస్టార్  హార్స్ రైడింగ్ సన్నివేశాలు చాలా బాగా చేశారు. క్లయిమాక్స్ లో ఆయన చేసిన పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో తమన్నా క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో కనిపించింది. ఆమె నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సైరా కి రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎంతగానో హెల్ప్ అయ్యింది. ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా చూపించారు. సినిమా చూసిన వారందరూ ఆయన పని తనాన్ని మెచ్చుకుంటున్నారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సైరా నరసింహారెడ్డి  సినిమాటోగ్రఫర్ రత్నవేలు కి ప్రత్యేకంగా అభినంధనలు తెలుపుతూ సందేశం పంపారు. ఈ సందర్భంగా  రత్నవేలు పవన్ కళ్యాణ్ పంపిన లెటర్ ని మరియు గులాబీ బొకే  ఉన్న ఫోటో ను  షేర్ చేస్తూ మీ ప్రేమ మరియు ప్రశంసలకి ధన్యవాదాలు అనీ ట్వీట్ చేశారు. సైరా  నరసింహారెడ్డి సినిమాకి పని చేసిన  మరికొంత మంది కి కూడా పవన్ కళ్యాణ్ విషెస్ పంపినట్టు తెలుస్తోంది.

Thank you @PawanKalyan garu for your appreciation n love .
Humbled !! pic.twitter.com/3ajOsnR04I

— Rathnavelu ISC (@RathnaveluDop) October 2, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: