సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకుడు. లోగడ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఆకట్టుకోనున్న ఈ చిత్రం ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో వుంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
`లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా సక్సెస్ తరువాత ప్రస్తుతం `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు వర్మ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి సైలెంట్గా రిలీజ్కు రెడీ అవుతోంది. బీచ్లో హీరో హీరోయిన్ల హాట్ హాట్ రొమాంటిక్ షాట్స్తో రూపొందించిన బ్యూటిఫుల్ ట్రైలర్ను వర్మ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ సినిమాను వర్మ స్వయంగా టీ నరేష్ కుమార్, టీ సురేందర్లతో కలిసి టైగర్, కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు.
వర్మ మార్క్ క్లాసిక్గా పేరు తెచ్చుకున్న రంగీల సినిమాకు కావ్య రూపంగా ఈ సినిమా తెరకెక్కుతుందన్ని ప్రచారం చేస్తున్నారు చిత్రయూనిట్. బ్యూటిఫుల్ పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏ ఏ భాషల్లో రూపొందిస్తున్నారు. రిలీజ్ ఎప్పుడు అన్న విషయం ప్రకటించాల్సి ఉంది.
ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.