అల్లు అర్జున్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగనాధ్ తెరకెక్కించిన 'ఇద్దరమ్మాయిలతో' సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కేథరిన్ థ్రెసా. ఆ సినిమా యావరేజ్ అవడంతో వెంటనే సినిమాలు చేయలేకపోయింది. అయితే మళ్ళీ అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో గ్లామరస్ ఎమ్మెల్యేగా ఆకట్టుకుంది. టాలీవుడ్ లో చాలా సినిమాలే చేసినప్పటికి ఆశించనంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. అయితే కోలీవుడ్లో మాత్రం మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటు స్టార్ హీరోయిన్గా ఆకట్టుకుంటోంది.
ఇక రీసెంట్గా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టే కేథరిన్ ఓ వింత జబ్బుతో బాధపడుతోందట. తానకు ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నప్పటికి ఎవరితో షేర్ చేసుకోలేదని తెలిపింది. అయితే లక్ష మందిలో ఒక్కరి మాత్రమే వచ్చే సమస్య అని చెప్పింది. అదేంటంటే కేథరిన్ వాసనలు తెలుసుకోలేదట. సువాసన అయినా చెడ్డ వాసన అయినా అది కేథరిన్కు మాత్రం ఎలాంటి తేడా తెలియదట. ఈ జబ్బును 'అనోస్మియా' అంటారట. ఇది ఒక అరుదైన వ్యాది.. లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్య ఉంటుందట.
అంతేకాదు తనకున్న ఈ వింత జబ్బు కారణంగా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో జీవితంలో పెళ్లే చేసుకోవద్దని నిర్ణయించుకుందట. అయితే ఈ విషయం తెలిసిన కొందరు ఈ జబ్బుకు ఇక పరిష్కారమే లేదా అంటు బాధ పడుతున్నారట. ఇక కేథరిన్ ప్రస్తుతం తెలుగులో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తోంది. అంతేకాదు కేథరిన్ నటించిన మూడు తమిళ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సస్ ని అందుకున్నాయి. ఇవి కాకుండా కొన్ని సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.