ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా 2019 లో టాలీవుడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు రామ్. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఒక మాస్ ఎంటర్టైనర్ తోనే రావాలని తన నెక్స్ట్ సినిమాని ఇన్నాళ్ళు ప్రకటించలేదు. ఎట్టకేలకు రామ్ కి కలిసొచ్చిన, రెండు సూపర్ హిట్ట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమాని చేయబోతున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్ విడుదలై 100 రోజులు పూర్తయినా సందర్భంగా దీపావళి రోజున అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు రామ్. తన కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించారు. తనతో 'నేను శైలజా', 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలు చేసిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో తన తరవాత సినిమా చేయబోతున్నారు రామ్.
కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న 'స్రవంతి' రవికిశోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్టిచ్చిన మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఇక ఈ సినిమా టైల్ తో పాటు రామ్ ఫస్ట్ లుక్ ని ఈ సోమవారం రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి 'రెడ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్లుక్ పోస్టర్ను రామ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టైటిల్ మాదిరిగానే పోస్టర్లో రామ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది.
'దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి సో బ్లడీ డిఫరెంట్' అని రామ్ తన ట్వీట్కు క్యాప్షన్గా పెట్టారంటే సినిమా ఎంత డిఫరెంట్గా ఉండబోతోందన్న విషయం అర్థమవుతోంది. ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫ్రెంట్ బ్యాగ్డ్రౌండ్ లో తెరకెక్కబోతోందట. రామ్ - తిరుమల కిషోర్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక నవంబర్ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని తెలిపారు. కాగా, పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్గా పనిచేస్తుండటం మరో విశేషం.