నిర్మాతల విషయంలో నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంటున్న హీరోయిన్!
జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించడంతో ఇంకా తాను చిన్న హీరోయిన్ కాదనుకొని ఫీల్ అవుతున్నట్లు ప్రస్తుతం ఆమె చేస్తున్న చేష్టలు బట్టి తెలుస్తుంది. అందుకే తాను నటిస్తోన్న చిన్న చిత్రాల నిర్మాతలకు ఆమె సహకరించడం లేదని టాక్. 'రాబోయే ఇరవై నాలుగు గంటల్లో' అనే థ్రిల్లర్ సినిమాలో సత్యదేవ్ తో కలిసి ఈషా నటించింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేసిన ఈషా ఆ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కి ఈషా రెబ్బ మొహం చాటేసి ఆ సినిమా నిర్మాతలను ముప్పు తిప్పలు పెడుతున్నట్లు ఈషా రెబ్బ పై నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ఆ సినిమా నిర్మాతలు చిన్న సినిమా కాబట్టి తనకు ఉన్న పదమూడు లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ సినిమాకి హెల్ప్ అవుతుందని భావించి..సినిమాకి సంబంధించిన ప్రమోషన్ వీడియో ఈషా రెబ్బ తో చేయించాలని అనుకుంటున్నారట.. .కానీ హీరోయిన్ ఈషా రెబ్బ మాత్రం నిర్మాతలను పట్టించుకోవడం లేనట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఈషా రెబ్బ ఇలా అనుసరిస్తే తన ఫ్యూచర్ కి డ్యామేజ్ పడే అవకాశం ఉందని అంటున్నారు.