RRR సినిమా తర్వాత రిస్కు చేస్తున్న రామ్ చరణ్..?
సైరా సినిమా అదిరిపోయే రేంజ్ లో హిట్ అవడంతో చాలా ఉత్సాహంగా rrr సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం షూటింగ్ కి కాస్త గ్యాప్ దొరకటంతో….రామ్ చరణ్ తేజ్ rrr సినిమా తర్వాత చేయబోయే సినిమా కోసం స్టోరీలు రెడీ చేయాలని డైరెక్టర్స్ కి కాల్ ఇవ్వటంతో..'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ రాంచరణ్ ని కలసి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పూర్తి కథ సిద్ధం చేసి తనకు నేరేషన్ ఇవ్వాలని రాంచరణ్ విక్రమ్ కుమార్ ని కోరినట్లు తెలుస్తోంది.
విక్రమ్ కుమార్ ఎంచుకునే కథాంశాలన్నీ మాస్ ప్రేక్షకులకు దూరంగా ఉంటాయి. విక్రమ్ తెరక్కించిన చిత్రాల్లో మనం, ఇష్క్ మంచి విజయం సాధించాయి. 24, హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలు బావున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ అనే పూర్తి మాస్ తరహా స్వతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన సినిమా తర్వాత రాంచరణ్ విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టమని రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉందని ఇది రిస్క్ అంటూ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది రామ్ చరణ్ తీసుకోబోతున్న నిర్ణయంపై కామెంట్లు చేస్తున్నారు.