ఎన్నో గొడవలు, ప్రేమలు, బుజ్జగింతలు అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో... ఇవ్వన్నీ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా అదే నంది గత 105 రోజుల నుంచి తెలుగు ప్రజలు చుస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 గురించి. ఎట్టకేలకు ఈ రోజుతో ఈ సీజన్ కి ముగింపు పలకబోతున్నాడు టాలీవుడ్ అగ్రకథానాయకుడు నాగార్జున.
కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్బాస్ సీజన్ 3'. వెండితెర, బుల్లితెరలకు చెందిన మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో జులైలో ఈ షో ప్రారంభమైంది. దాదాపు 105 రోజులపాటు సాగిన ఈ ప్రయాణం నేటితో శుభం పడనుంది. ఫైనల్ కు చేరుకున్న వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి లలో ఎవరు విజేత అవుతారో నేడు తెలిసిపోనుంది.
అయితే, ఇప్పటికే సోషల్మీడియా వేదికగా 'బిగ్బాస్ సీజన్ - 3' విన్నర్కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నాగార్జున ట్విటర్ వేదికగా సీజన్ 3 విజేతకు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మకండి అంటూ తన అధికారిక ట్వీట్ చేశారు. ''బిగ్బాస్ సీజన్ - 3' చివరి రోజు షూటింగ్ ఇదో అద్భుతమైన ప్రయాణం, నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. విజేతకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. ఈ రోజు సాయంత్రం విజేత ఎవరో తెలుస్తుంది' అని నాగార్జున ఈ సంద్రాభంగ ప్రస్తావించారు తన ట్విట్ లో.
ఇది అంత ఒక పక్కన ఉంటే బయట మాత్రం రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ఫ్యాన్స్ మాత్రం రచ్చ రచ్చ చేస్తునారు సోషల్ మీడియా లో. తమ అభిమానాన్ని ఓటు రూపంలో చూపాలని అనేక సామిజిక మార్గాలలో వారు కోరుతున్నారు. ఇప్పటికే చాలా ఓట్లు పోలు అయినట్లు బిగ్ బాస్ నిర్వాకుల నుంచి సమాచారం అందుతుంది.