సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈచిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం కేరళలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తరువాత ఇంకో మూడు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. డిసెంబర్ మొదటి వారం లోకెల్లా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీపావళి కానుకగా ఈచిత్రం నుండి విడుదలైన మహేష్ బాబు పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను నవంబర్ మూడవ వారంలో విడుదలచేయనున్నట్లుగా తెలుస్తుంది. కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. ఈసినిమా తో 13ఏళ్ళ తరువాత ఆమె మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈచిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి12 న విడుదలకానుంది.
అయితే ఈసినిమాకుబాక్సాఫీస్ వద్ద గట్టి పోటీఎదురు కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో .. కూడా అదే రోజు విడుదలవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టి అంచనాలను అమాంతగా పెంచేశాయి. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా ఈసినిమా, సరిలేరు నీకెవ్వరు కంటే ఓ మెట్టు పైనే వుంది , మరి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం పై చేయి సాధిస్తుందో చూడాలి.