RRR సినిమాకి అతి పెద్ద ప్లస్ అదే ఫిలింనగర్ లో వైరల్ అవుతున్న న్యూస్..!
స్వాతంత్ర పోరాట నేపథ్యంలో కల్పిత కథ గా రాజమౌళి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక వైరల్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. అదేమిటంటే సినిమా కి జూనియర్ ఎన్టీఆర్..రామ్ చరణ్ లా కంటే అతి పెద్ద ప్లస్ సినిమా స్టోరీ అని అంటున్నారు. ఈ సినిమాకి స్టోరీ అందించింది విజయేంద్రప్రసాద్. గతంలో బాహుబలికి అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి దానికంటే మంచి అద్భుతంగా స్టోరీని క్రియేట్ చేసాడన వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా సినిమాకి మాటలు సాయిమాధవ్ బుర్రా అందించడంతో రాజమౌళి డైరెక్షన్లో విజయేంద్రప్రసాద్ స్టోరీకి సాయిమాధవ్ బుర్రా తోడైతే అది గ్యారెంటీ అద్భుతం అంటూ ఇండస్ట్రీలో చాలామంది ఈ సినిమాపై కామెంట్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది జులై నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఇటీవల నార్త్ ఇండియాలో కొన్నిచోట్ల ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించిన సినిమా యూనిట్ త్వరలోనే హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు సమాచారం.