టాలీవుడ్లో హీరోల వారసులు హీరోలుగా రావడం ఎక్కువగా జరుగుతూ వుంటుంది . ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు టాలీవుడ్ కి ఎంట్రి ఇచ్చి తమ హవా నడిపిస్తున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది టాలీవుడ్ కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు... కానీ వారిలో ఎక్కువగా రాణిస్తుంది మాత్రం నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్... అయితే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు తప్ప ఎవరు హీరోగా రాలేదు. టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. మహేష్ బాబు పెద్దబావ గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ కి హీరోగా పరిచయం కాబోతున్నాడు.
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల హీరోగా పరిచయమవుతున్న సినిమాను భారీగానే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించబోతున్నాడు. భలే మంచి రోజు, శమంతకమని, దేవదాస్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. టాలీవుడ్ స్టార్ హీరోలైన నాని నాగార్జున లాంటి హీరోలతో దేవదాసు సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు శ్రీరామ్ ఆదిత్య. అయితే దేవదాసు సినిమా అంతగా బాక్సాఫీస్ దగ్గర హవా చూపించక పోయినప్పటికీ... ప్రేక్షకులకు ఫన్ మాత్రం బాగానే అందించాడు.
కాగా గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ హీరోగా పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేతిలో పెట్టారట గల్లా జయదేవ్ . అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ సత్య అర్చన సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడు జిబ్రాన్ స్వరాలను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీరామ్ ఆదిత్య . నవంబర్ 10న భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు కుటుంబం నుంచి ఇప్పటికే వచ్చిన సుధీర్ బాబు టాలీవుడ్ లో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బాగానే రాణిస్తున్నారు. మరి మహేష్ బాబు కుటుంబం నుంచి రాబోతున్న అశోక్ గల్లా టాలీవుడ్ లో ఎలా రాణిస్తారో చూడాలి మరి.