ధనుష్ నటించిన తాజా చిత్రం ‘అసురన్’ ఇటీవలె తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో చేయడానికి చాలా మంది ఉర్రూతలూగుతున్నారు. వారిలో మొదట రాంచరణ్ ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ ను తీసుకోవాలని చూశారు కానీ ఈ లోపే ఈ చిత్రాన్ని చూసిన విక్టరీ వెంకటేష్ వెంటనే తెలుగులోకి రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాను సురేష్ బాబు స్వయంగా నిర్మించనున్నారు.
ఇక ‘అసురన్’ సినిమా అంత గొప్పగా రావడానికి, ధనుష్ పెర్ఫార్మెన్స్ భీభత్సమైన రీతిలో పండటానికి ప్రధాన కారణం వెట్రి మారన్ డైరెక్షన్. అందుకే అలాంటి విజన్ ఉన్న దర్శకుడినే రీమేక్ కోసం ఎంచుకోవాలని, లేకుంటే ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదముందని వెంకీ, సురేష్ బాబులు భావిస్తున్నారు. అందుకే ఉన్న యువ దర్శకుల్లో ఎవరు డైరెక్ట్ చేయగలరనే విషయాన్ని రూఢీ చేసుకోవడానికి వారిద్దరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. మరి వారి ప్రయత్నాలు ఫలించి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఇక ఇదిలో ఉంటే ఈ చిత్రంలో ధనుష్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒకటి యంగ్ పాత్ర అయితే రెండొది కాస్త ఓల్డ్ ఏజ్ పర్సన్లాగా కనిపిస్తాడు. మరి ధనుష్ సూట్ అయినట్లు వెంకీ సూటవుతాడా రెండు పాత్రల్లోనూ ప్రేక్షకులను ధనుష్ లాగా మెప్పించగలడా అని కొందరు అనుకుంటున్నారు. ఇకపోతే సినిమా తమిళ్ లో హిట్ అయిన రేంజ్ తెలుగులో కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధించాలంటే మంచి దర్శకుడు కచ్చితంగా దొరకాలి. సినిమా చూసి యాజిటీజ్ గా రీమేక్ చెయ్యగలమని ఎవరు ముందుకు వస్తే వారికి బాధ్యత అప్పగించాలని ప్లాన్ చేసారు. మొన్న అందరు చూశారు. కానీ ఫైనల్ గా ఎవరు ముందుకొచ్చారనేది తెలియలేదు.
వెంకటేష్ నటించిన వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉంది. వెంకీ ఇప్పుడు అసురన్ రీమేక్ కానీ, తరుణ్ భాస్కర్ రెడీ చేసే కొత్త కథ కానీ సెట్ మీదకి తీసుకెళ్లాలి.