కడుపుబ్బా నవ్విస్తున్న ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’
టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులు వరుసగా వెండి తెరకు పరిచయం అవుతున్న సందర్భంగా ప్రముఖ ఛాయాగ్రహకులు చోటా కే నాయుడు బంధువుగా యువ హీరో సందీప్ కిషన్ వెండి తెరకు పరిచయం అయ్యాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి విజయం అందుకున్న సందీప్ కిషన్ తర్వాత ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోతున్నాడు. తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అనేది ట్యాగ్లైన్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.ః
సినిమా ఫస్ట్లుక్ను సందీప్కిషన్ పుట్టినరోజు(మే 7) సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనపడుతున్నారు. సందీప్ కిషన్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. కానీ కొన్నిళ్ళుగా సరైన హిట్ లేదు. అయితే ఈ ఏడాది తనా నిర్మించిన నిను వీడను నీడను నేనే మూవీలో మంచి హిట్ అందుకున్నాడు. ఆ జోష్ లోనే ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్ గా తెనాలి రామకృష్ణ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కొద్ది రోజులుగా చిత్ర యూనిట్ కొన్ని కాలేజీల్లో సందడి చేస్తూ ఫుల్ గా ప్రమోషన్స్ చేస్తోంది.
సందీప్ తో పాటు హన్సిక, వరలక్ష్మి నటించడం సినిమాపై స్పెషల్ ఎట్రాక్షన్ ఏర్పడుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే..యాక్షన్ తో పాలు పూర్తి స్థాయిలో కామెడీ ఎంట్రటైన్ మెంట్ తో సాగుతున్నట్లు కనిపిస్తుంది. మరి తెనాలి రామకృష్ణ, టైటిల్ కి తగ్గట్లే ఆడియన్స్ ని ఏ రేంజ్ లో నవ్విస్తాడో చూడాలి. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు. లాఫింగ్ రైడర్గా రూపొందుతున్న ఈ మూవీ హన్సిక, వరలక్ష్మి శరత్కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫన్నీ సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.