వాస్తవానికి పరిపాలించేది కమ్మ వాళ్లే రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్..?
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసం విజయవాడలో కి వద్దామని మనకున్న రాంగోపాల్ వర్మ కి అప్పటి అధికార ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్రస్తుతం అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇటువంటి నేపథ్యంలో త్వరలో ఈ సినిమా విడుదల అవుతున్న ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేస్తున్నారు రాంగోపాల్ వర్మ.
ఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ కమ్మ సామాజిక వర్గం గురించి షాకింగ్ కామెంట్ చేశారు. “తనకు మరో జన్మ అంటూ ఉంటే కమ్మవాడిగానే పుడతానని వర్మ స్టేట్ మెంట్ ఇచ్చాడు మన రాంగోపాల్ వర్మ. అంతేకాకుండా తాను స్వతహాగా రాజుల సామజిక వర్గానికి చెందినవాడని, తన కులస్తులందరు కూడా సాత్వికులు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తను కమ్మ కులానికి పెద్ద అభిమానినని, కమ్మ కులస్తులే నిజమైన రాజులని చెప్పారు.వాస్తవానికి పరిపాలించేది కమ్మ వాళ్లే అన్నట్టుగా కామెంట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ తనకి కమ్మ వాడిగా పూట్టాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చారు.