బాహుబలి చిత్రంలో నటించడంతో చాలా మంది పాత్రలకి మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు. ఆమె కనబరిచిన నటన అద్భుతం. దాంతో ఆమెకు అన్ని భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు ముందు పెద్దగా ఛాన్సులు లేకపోయినా అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ బాహుబలితో మంచి క్రేజ్ వచ్చింది. నరసింహా సినిమాలో నీలాంబరి గా నటించి అదరగొట్టింది. ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చే పాత్రలో ఆమె నటించలేదు.
ఇప్పటి బాహుబలితో మళ్లీ ఆ స్థాయిని దక్కించుకుని వరస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది. అయితే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాడురి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. ప్రజంట్ ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడ హీరో, హీరోయిన్, మరియు రమ్యకృష్ణ పై వచ్చే ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేస్తున్నారట. అలానే రెండు సాంగ్స్ ని కూడా చిత్రీకరించనున్నారు.
దాదాపు నెల పాటు గోవాలోనే షూటింగ్ జరుపుకునే ఈ సినిమా ఆకాష్ కు రెండో చిత్రం. మొదటి చిత్రం మోహబూబా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా బాగుంటుందని.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో రవితేజ, జయసుధ లాగే ఈ సినిమా ఆకాష్, రమ్యకృష్ణ మధ్య సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఆకాష్ పూరీ సరసన ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా వదిలిన ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పోస్టర్ కాక పుట్టించిన సంగతీ తెలిసిందే. ఇక సినిమాలో ఇలాంటి స్పెషల్ రొమాంటిక్ ట్రీట్ చాలానే ఉండనుందట. పూరీ కనెక్స్ట్ బ్యానర్లో పూరీ జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ హిట్ కొట్టి జోష్ మీదున్న పూరీ, తనయుడికి కూడా అలాంటి ఓ హిట్ అందించాలనే తపనతో ఉన్నాడు 'రొమాంటిక్' చిత్రంతో. చూడాలి మరి, పూరీ ఆశలు నెరవేరుతాయో.? లేదో.? స్టిల్స్ చూస్తుంటే కొంచం ఘాటు ఎక్కువయింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే పూరీ సినిమాలంటే హీరో హీరోయిన్ల మధ్య కాస్త ఘాటు ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇందులో ఇంకాస్త ఎక్కువయినట్టే అనిపిస్తుంది.