టాలీవుడ్ లో ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ ఫైట్ ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ సారి మాత్రం బాక్సాఫిస్ వద్ద మరింత స్పైసీగా మారనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లు సంక్రాంతి బరిలో తలపడేందుకు కాలు దువుతున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలను ఒకే రోజు విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు.
వాస్తవానికి మొదట ఈ రెండు సినిమాలను రెండు లేదా మూడు రోజుల గ్యాప్లో విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని ఇద్దరు హీరోలు కూడా నేను వెనక్కు తగ్గనంటే నేను కూడా వెనక్కు తగ్గను. అసలు నేను వెనక్కు తగ్గాల్సిన అవసరం ఏంటీ అంటూ ఇద్దరు అంటున్నారు. సంక్రాంతి సీజన్ కనుక రెండు రోజుల గ్యాప్లో వస్తే రెండు సినిమాలకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుందని అంతా భావించారు. కానీ వీరు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఇక దీంతో ర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా చాలా రోజుల తరువాత రెండు పెద్ద సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంతో పోలిస్తే నేటితరం హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి చాలా దూరంగా ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు గాని ఈగోకి పోయి ఎవరుకూడా రిస్క్ చేయడం లేదు. కానీ ఎంతో మంది చెప్పినా కూడా ఆ ఇద్దరు హీరోలు వినక పోవడంతో చేసేది ఏమీ లేక నిర్మాతలు అదే రోజున విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.
కాగా, అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహింస్తున్నారు. ఇక మహేష్కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.