సినిమా విడుదలకు ముందే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా స్టోరీ లీక్..?
సోషల్ మీడియా లో విడుదలైన స్టోరీ బట్టి చూస్తే సినిమా స్టార్టింగ్ లోనే మహేష్ మిలట్రీ ట్రైనింగ్ తో మొదలవుతుందని ఆ తర్వాత ట్రైన్ జర్నీ లో హీరోయిన్ కలుసుకోవడం జరుగుతుందని ఆ ట్రైన్ జర్నీ లో కామెడీ ఎపిసోడ్ ఎక్కువగా ఉంటుందని సినిమాకి అదే హైలెట్ అవుతుందని..ముఖ్యంగా కమెడియన్ బండ్ల గణేష్ మరియు కొంతమంది జబర్దస్త్ కామెడీ షో కి సంబంధించిన నటీనటులతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ సీన్లు సినిమాకే హైలెట్ అని...అలాగే మహేష్ కర్నూల్ లో దిగాక అక్కడ పొలిటియన్ అయినటువంటి విజయశాంతితో కొన్ని రాజకీయ సమస్యల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని వాటిని హీరో ఎలా ఎదుర్కొని పరిష్కారం చూపించాడు అన్నదే అసలు కథ అని..ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.
దీంతో మహేష్ అభిమానులు సినిమా హిట్ అవడం గ్యారెంటీ అని...స్టోరీ పరంగా చూసుకుంటే మహేష్ బాబుకి సినిమాలో అదిరిపోయే పంచ్ డైలాగులు అనిల్ రావిపూడి రాసినట్లు అర్థమవుతుందని...సంక్రాంతికి కచ్చితంగా మహేష్ బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.