ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్న గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే. గ్లామర్ షోకు ఏ మాత్రం వెనుకాడని పూజా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్గా హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు తన సినిమాలతో పాటు ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్లతో జనాలకు పిచ్చెక్కిస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న టాప్ డిజైనర్స్లో మనీష్ పేరు ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎంతో మంది బాలీవుడ్ టాప్ స్టార్ల కోసం మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేశారు. తాజాగా ఆయన భారతీయ సాంప్రదాయ దుస్తుల థీమ్తో ఓ ఫ్యాషన్ షోను నిర్వహించారు. అయితే పేరు సాంప్రదాయ దుస్తుల షో అయినా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గలేదు.
ఈ ఈవెంట్లో హాట్ బ్యూటీ పూజా హెగ్డే తన అందాలతో ఆకట్టుకుంది. మనీష్ డిజైన్ చేసిన లెహంగాలో పూజా అందాలు మరింతగా ఆకట్టుకున్నాయి. ఈ ఈవెంట్లో పూజా పాల్గొన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేశాడు మనీష్. అంతేకాదు మనీష్తో కలిసి వేదిక మీద స్టెప్ వేసిన పూజా ఈ వీడియోనే తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది. ఇక రీసెంట్గా బాలీవుడ్లో సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ హౌస్ఫుల్ 4లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముక్, బాబీ డియోల్, క్రితి సనన్, కృతి కర్బందా కలిసి నటించింది. ఈ సినిమా 270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఇక ప్రస్తుతం పూజ రెండు తెలుుగు సినిమాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు.