అందాల తార రష్మిక యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఛలో సినిమా లోని రష్మిక పాత్రకు మంచి పేరు తో పాటు అవకాశాలు రావడం మొదలైయ్యయి. ఆ తరువాత యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమా లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా దాదాపు గా 100 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో రష్మిక కు తెలుగు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఆ తరువాత ఆమె నాని , నాగార్జున కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా " దేవదాస్ " లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తరునాత విజయ్ తో రెండవ సారి డియర్ కామ్రెడ్ సినిమా లో నటించింది. ఈ సినిమా కోసం రష్మిక చాలా కష్టపడి క్రికెట్ నేర్చుకుంది. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు కానీ రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.
రష్మిక మందన వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది. మహేష్ బాబు హీరో గా నటిస్తున్న "సరిలేరు నీకెవ్వరూ" లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బన్ని సుకూమార్ సినిమా లో హీరోయిన్ గా ఓకే అయ్యింది. నితిన్ హీరో గా నటిస్తున్న భీష్మ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న" సుల్తాన్ " సినిమా లో రష్మిక గా హీరోయిన్ గా నటిస్తుంది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో రష్మిక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.తనకు మేకప్ వేసుకోవడం, అలంకరించుకోవడం నచ్చదని అంది. తనకు సహజంగా ఉండడమే నచ్చుతుందని, షూటింగ్లకు కాకుండా బయటకు వెళితే ఎలాంటి మేకప్ వేసుకోకుండానే వెళతానంది.