అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీముఖి...
'పటాస్' షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యింది యాంకర్ శ్రీముఖి.. ఆ షోకు శ్రీముఖి అల్లరి, అందాలే పెద్ద అస్సెట్గా నిలుస్తూ వచ్చాయి.. అయితే కొన్ని రోజుల పాటు పటాస్ షో నుండి విరామం తీసుకుని తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' సీజన్లో శ్రీముఖి పాల్గన్న విషయం తెలిసిందే.
ఆ షోలో పాల్గొనడమే కాదు మూడవ సీజన్ రన్నరప్గా కూడా నిలిచింది. ఇక బిగ్ బాస్ హౌజ్లో మూడు నెలలకు పైగా తన అల్లరితో, టాస్క్లతో అదరగొట్టిన శ్రీముఖి ఆ షో ముగిసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది. ఆ వెకేషన్ను ఇటీవలే పూర్తి చేసుకుని షూటింగ్లో మళ్లీ బిజీ అయ్యింది శ్రీముఖి. ఇక తన సోషల్ మీడియా వేదికగా ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేసి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మళ్లి తెరపై అతి త్వరలోనే కనిపిస్తానని, అందులో భాగంగా ఆరోగ్యం సరిగా లేకున్నా స్టార్ మాలో అదిరిపోయే ప్రోగ్రామ్ షూటింగ్లో పాల్గొంటున్నాని పేర్కోంది. ఇదే కాకుండా శ్రీముఖి బిగ్ బాస్ హౌస్లో తన 105 రోజుల ప్రయాణంలో ఎంతగానో సహకరించిన అభిమానుల కోసం ఆమె కొత్తగా ఓ నిర్ణయం తీసుకుంది. అదేమంటే బిగ్ బాస్ హౌస్లో తనకు చివరి వరకు అండగా నిలిచిన అభిమానులను కలవాలని నిర్ణయించుకుందట..
ఇందుకు గాను ఆమె త్వరలోనే ఓ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేయబోతోందట. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, ఫ్యాన్స్ను ఎప్పుడు కలవాలి అనే దానిపై శ్రీముఖి టీమ్ కసరత్తు కూడా చేస్తోందట. దీనిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుందని. ఆ తర్వాత దీనికి సంబంధించిన వివరాలను తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేయనున్నామని తెలిపారు. ఇక ఈ పోగ్రాం ద్వారా శ్రీముఖీ తన అభిమానుల్లో జోష్ నింపబోతుందనుకుంటున్నారు కొందరు. చూద్దాం ఆమె ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో..