మా మధ్య వున్నది స్నేహం మాత్రమే : పునర్నవి
తెలుగులో వస్తున్న బిగ్ బాస్ షో కి మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హూస్ట్ చేయగా..సీజన్ 2 నేచురల్ స్టార్ నాని చేశారు. అప్పట్లో బిగ్ బాస్ పై కొన్ని విమర్శలు వచ్చినా..టీఆర్పీ రేటింగ్ మాత్రం బాగానే వచ్చింది. ఇక మూడో సీజన్ కి కింగ్ నాగార్జున్ హూస్ట్ గా వ్యవహరించారు. ఈసారి బిగ్ బాస్ లోకి పదిహేడు మంది కంటిస్టెంట్స్ వచ్చారు. ఇందులో భార్యాభర్తలుగా సినీనటులు వరుణ్ సందేశ్, వితిక లు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో గతంలో మాదిరిగా పెద్దగా గొడవలు, గిల్లి కజ్జాలు..మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ముగిసింది.
ఇక బిగ్ బాస్ 3 వ సీజన్ నికి సింగర్ రాహూల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. ఇక రన్నరప్ గా యాంకర్,నటి శ్రీముఖి నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహూల్ సిప్లిగంజ్ బహుబతి అందుకున్నాడు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 లో ఓ జంట మంచి సందడి చేసింది. బిగ్ బాస్ 3' హౌస్ లో రాహుల్ - పునర్నవికి మధ్య జరిగిన కొన్ని సంభాషణలు .. కొన్ని సంఘటనలు చూసినవారు, ఈ ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని భావించారు. మా మధ్య ఏం లేదు మొర్రో అంటున్నా.. హోస్ట్ నాగార్జున దగ్గర నుండి రమ్యక్రిష్ణ వరకూ వీళ్ల మధ్య సంథింగ్ సంథింగ్ నడిచేస్తుందంటూ లవ్ ట్రాక్ వేశారు.
అయితే వీరి వ్యవహారం కూడా గాఢమైన ప్రేమికుల మాదిరి తలపించేది. షల్ మీడియాలో రాహుల్, పునర్నవిలు ప్రేమపక్షులు కింద కట్టి ఎవరికి ఇష్టం వచ్చి వాళ్లు కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పునర్నవి స్పందిస్తూ .. "బిగ్ బాస్ హౌస్ లో 15 మంది ఉండటంతో .. ఎవరికి కంఫర్ట్ గా వున్న టీమ్ లోకి వాళ్లు వెళ్లారు. అయితే నేను నా కంఫర్ట్ కోసం వరుణ్ సందేశ్, వితికతో ఉండేదానినని అయితే వారితో స్నేహంగా ఉన్న రాహూల్ తో కూడా సన్నిహితంగా ఉండేదని చెప్పింది.
వరుణ్ - వితిక భార్యాభర్తలు...వారితో షేరు చేసుకోలేని కొన్ని ఎమోషన్స్ రాహూల్ తో షేర్ చేసుకోవడం వలన అలా అనుకుని వుంటారు. కానీ మా మధ్య వున్నది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చింది.