మొత్తానికి ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఫిక్స్....??

Mari Sithara

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఇటీవల యూరోప్ లోని కొన్ని ప్రాంతాలను పోలిన సెట్స్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో వేసి, ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపుగా ఈ సెట్స్ కోసం రూ.25 కోట్ల వరకు సినిమా యూనిట్ వెచ్చించినట్లు టాక్. 

 

యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని రాబోయే వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా విషయమై నేడు కఫార్మేషన్ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రభాస్ తన తదుపరి సినిమాని ఇటీవల సైరా నరసింహారెడ్డిని తెరకెక్కించిన సురేందర్ రెడ్డితో ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి కొద్దిరోజుల క్రితమే ప్రభాస్ కు సురేందర్ రెడ్డి ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ లైన్ ని వినిపించడం జరిగిందని, అయితే ఆ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో, దాని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయమని సురేందర్ రెడ్డికి ఆయన చెప్పినట్లు సమాచారం. 

 

కాగా నేడు ఆ సినిమా కథ పూర్తిగా సిద్ధం అవడంతో సురేందర్ రెడ్డి, జాన్ షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ ని కలిసి పూర్తిగా వివరించడం జరిగిందని, ఆ కథతో అన్ని విధాలా సంతృప్తి చెందిన ప్రభాస్, మరికొద్దిరోజుల్లో ఆ సినిమాను మొదలెడదాం అని చెప్పారట. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అలానే ఈ వార్తపై అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: