కే ఏ పాల్ పై సెటైర్లు వేసిన రామ్ గోపాల్ వర్మ…!

KSK

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో సినిమాలో ఉన్న పాత్రలు మరియు పాటలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అదేవిధంగా ఒక ప్రముఖ వర్గంలో ఇదే తరుణంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో ఈ సినిమాపై తీవ్రమైన వ్యతిరేకత కామెంట్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో సినిమా ను ఆపేయాలని చాలామంది వివిధ పార్టీల రాజకీయ నేతలు రామ్ గోపాల్ వర్మ పై విమర్శలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న నాటినుండి తనకి గెలవడం అంటే తనకు బాగా ఇష్టమని అందుకే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తీయటం వెనుక ఎటువంటి ఉద్దేశం లేదని ఏ వర్గాన్ని తక్కువచేసి చూపించలేదని...ఇది ఒక సందేశాత్మక మైన సినిమా అని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నేను ఏదైతే అనుకున్ననో... ఆ అంశాన్ని వెండితెరపై సినిమాగా చూపిస్తానని...ఈ సినిమా తెరకెక్కించేందుకు తనకి ఎవరి దగ్గర నుంచి బెదిరింపులు గాని మరొకటి గాని రాలేదని క్లారిటీ ఇచ్చారు.

 

మామూలు క్రైమ్ కంటే పొలిటికల్ క్రైమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రాన్ని ఓ ప్రముఖ తండ్రీ కొడుకులకు అంకితం ఇస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక కేఏ పాల్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపే పనిలో ఉన్నారన్న వర్మ.. ఆయన ఇలాంటివి పట్టించుకోరని భావిస్తున్నానని సెటైర్లు వేశాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: