పాపం ఇలియానా కన్నీటి కష్టాలు...!
టాలీవుడ్ లోకి వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే తన అందమైన నడుం వొంపులతో పిచ్చెక్కించింది. ఇక వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో మంచి ఛాన్సులు వస్తున్న సమయంలో బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. కానీ అక్కడ ఏ మాత్రం సక్సెస్ సాధించలేక పోయింది. ఇల్లీబేబి నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దాంతో టాలీవుడ్ లోకి రావాలని చూసినా అప్పటికే యువ హీరోయిన్లు తమ జోరు కొనసాగించడంతో ఇలియానాకు బ్యాడ్ టైమ్ మొదలైంది.
అయితేనే ఇన్నాళ్లు ఆదరించిన తెలుగు సినిమాలను పట్టించుకోలేదు సరికదా కేవలం బాలీవుడ్ సినిమాలనే చేస్తానంటూ భీష్మించుకున్న దశలోనే విదేశీ ఫొటోగ్రాఫర్ అండ్రూతో ప్రేమలో పడి, ఆ మత్తులో మునిగిపోయింది. అయితే బాలీవుడ్ ఈమెను పెద్దగా పట్టించుకోలేదు సరికదా అవకాశాలు అందకుండా పోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ పై ఫోకస్ చేయడం..సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం జరిగింది. టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకున్న రవితేజతో మరోసారి నటించింది. రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోనిస చేసినా, అది బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టడంతో ఇక్కడా అవకాశాలు మరింత సన్నగిల్లాయి. దీంతో గోళ్లు గిల్లుకుంటూ, భవిష్యత్ మీద ఆందోళనతో డిప్రెషన్లోకి వెళ్లిపోతోందట ఈ అమ్మడు.
ఈ మధ్య తరచూ నిద్రమాత్రలు తీసుకోవడం, ఫిట్నెస్పై దృష్టి పెట్టకపోవడంతో బాగా లావై, తన రూపమే తనకే వెగటనిపించి ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. ఒకప్పుడు సన్నగా నాజూగ్గా ఉన్న ఈ అమ్మడు బొండంగా మారడం తనకే నచ్చలేదని ఇల్లిబేబీ కన్నీరు పెట్టుకుంటుందట. ఇల్లి బేబి మళ్లీ కెరీర్లో రాణించాలని, పీక్కి చేరుకోవాలంటూ శరీరంపై బాగా దృష్టి పెట్టి బరువు తగ్గి, మళ్లీ నాజూకుగా తయారైంది.. ఇప్పుడు ఇలియానా నటించిన తాజా బాలీవుడ్ మూవీ "పాగల్ పంతి" ప్రేక్షకుల ముందుకు వచ్చింది.