పవన్ మాటలకు తీవ్ర ఆవేదనలో జనసైనికులు !

Seetha Sailaja

పవన్ కల్యాణ్ నిన్న తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన రైతు సదస్సులో తన అభిమానులను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులు కలత చెందినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ మైక్ వద్దకు రాగానే పూనకం వచ్చినట్లు ఊగిపోతు విజిల్స్‌ ను వేస్తూ పవన్ పై పూలు జల్లుతూ ఎంజాయ్ చేయడం పవన్ వీరాభిమానులకు ఉన్న అలవాటు. 

నిన్న కూడ మండపేటలో పవన్ కళ్యాణ్ కు రైతు సదస్సులో అదే సంఘటన జరిగింది.  పవన్ తన ఉపన్యాసం మొదలు పెట్టగానే కేకలు ఈలలతో ఆ సభావేదిక ప్రప్రతిధ్వనించడంతో పవన్ కు తమ  కష్టాలు చెప్పుకోవడానికి అక్కడకు వచ్చిన రైతులకు కూడ పవన్ వీరాభిమానులు చేస్తున్న ఈ హడావిడి తీవ్ర అసౌకర్యానికి గురి చేసినట్లు తెలుస్తోంది. 

జరుగుతున్న ఈ పరిణామాలు చూసి సహనం కోల్పోయి  పవన్ కళ్యాణ్ తన అభిమాలను  ఉద్దేశించి అన్నమాటలు మాత్రం అతడి అభిమానులకు షాక్ ఇవ్వడమే కాకుండా వారికి తీవ్ర నిరాశను కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. తన  అభిమానుల్లో కార్యకర్తల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే తమ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని పవన్ ఘాటైన కామెంట్స్ చేసాడు. 


వాస్తవానికి ఈ మధ్య జరిగిన ఎన్నికలలో పవన్ కు ఆరుశాతం ఓట్లయినా వచ్చాయంటే దానికి ప్రధాన కారణం పవన్ అభిమానుల వల్లనే జరిగింది అన్న విషయం ఓపెన్ సిక్రెట్. సాధారణంగా ఏపార్టీ అయినా కార్యకర్తల్ని నెత్తిన పెట్టుకుంటుంది. కార్యకర్తలని దేవుళ్లుగా భావిస్తుంది ఒక వేళ ఎన్నికలలో ఓడిపోయినా వచ్చే ఎన్నికలలో తాము నెగ్గబోతున్నాము అంటూ తమ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కలిగిస్తారు. ఇలాంటి పరిస్థితులలో మరో 30 సంవత్సరాలు రాజకీయాలలో కొనసాగుతాను అంటూ ఓపెన్ గా చెప్పే పవన్ తన కార్యకర్తలను తానే టార్గెట్ చేసుకుంటే ఇక రానున్న రోజులలో జనసేనకు జన సైనికులు మిగులుతారా అంటూ కొందరి కామెంట్స్ వినిపిస్తున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: