అర్జున్ సురవరం సక్సెస్ జోష్‌లో ఉన్న హీరో నిఖిల్ కి షాక్ ?

venugopal

సినిమా రంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్య పైరసీ ఇది ఇప్పటిది కాదు. ఈ పైరసి వల్ల ఎన్నో సినిమాలు నష్టాలకు గురి అయ్యాయి. ఇకపోతే లాస్ట్ వీక్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం రిలీజైంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి విడుదల వరకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఇక రిలీజ్ కాదేమో అనే అనుమానాలు తర్వాత రిలీజ్ అయ్యి ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

 

 

ఇక నిఖిల్ తన చిత్రం ప్రమోషన్ని తనే భుజాన వేసుకుని ఈ సినిమా ఆడుతున్న తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లను సందర్శిస్తూ ఫ్యాన్స్ ని కలుసు కుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఓ చేదు సంఘటన ఎదురైంది.. అదేమంటే సినిమా ప్రమోషన్  టూర్ లో భాగంగా  గుంటూరు వెళ్లిన నిఖిల్ కు రోడ్డు ప్రక్కనే బహిరంగంగా పైరసీ సీడీలు అమ్ముతున్న విషయం గమనించి షాక్ కి గురయ్యాడు. అనేక కష్టనష్టాలను ఓర్చుకుని, వేలమంది శ్రమిస్తే ఒక సినిమా రెడీ అవుతుంది.

 

 

అలాంటి సినిమా పైరసీ సీడీలను ఇలా రోడ్లపై అమ్మేస్తు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీ తాగుదామని రోడ్డు పక్కన దిగగా నిఖిల్ కు ఈ దృశ్యం కంటపడింది. ఇకపోతే ఇదే పరిస్థితి కనుక కొనసాగితే కొన్నాళ్ళకు సినిమా చచ్చి పోతుందని అన్నారు. అయితే పైరసీ సీడీలు అమ్ముతున్న మహిళను పోలీసులకు మాత్రం పట్టించలేదు. ఆమె దీన గాథను విన్న నిఖిల్, ఇలాంటి వాళ్ళను ఏమి చేయగలం అని అక్కడ నుండి వెళ్లిపోయారు.

 

 

ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆ వీడియోపై స్పందించిన ఓ అభిమాని పైరసీ సీడీని కనీసం 40 రూపాయలకైనా కొంటున్నారు...  కానీ, టెలిగ్రామ్‌ యాప్‌లో ఫ్రీగా పైరసీ లింక్ పోస్ట్ చేస్తున్నారని నిఖిల్ దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన నిఖిల్.. ప్రభుత్వం ఈ టెలిగ్రామ్ యాప్ ని బ్యాన్ చేయాలని, ఉగ్రవాదులు కూడా ఈ యాప్ ని వాడుకుంటు ఉన్నారని విజ్ఞప్తి చేశారు.. ఇదే కాకుండా ప్రేక్షకులకి పైరసీని ఎంకరేజ్ చేయవద్దని వీడియో ద్వారా విజ్ఞప్తి చేసారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: