గత ఏడాది అజ్ఞాతవాసి చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తరువాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కేవలం 20రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా వుండే కథను ను ఎంచుకున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏంటంటే హిందీ లో విజయం సాధించిన పింక్. దిల్ రాజు తో కలిసి బోనీ కపూర్ ఈ పింక్ ను పవన్ కళ్యాణ్ తో తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రానికి ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈరోజు ఈ చిత్రం దిల్ రాజు ఆఫీస్ లో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ఈచిత్రంలో యంగ్ హీరోయిన్ నివేత థామస్ కీలక పాత్రలో నటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక ఒరిజినల్ వెర్షన్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో నటించగా 2016 లో విడుదలైన ఈ చిత్రం 100కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు కూడా పొందింది. ఈ చిత్రం ఇటీవల కోలీవుడ్ లో 'నెర్కొండ పరవాయ్' అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తల అజిత్ నటించిన ఈచిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి కోలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈచిత్రాన్ని కూడా బోనీ కపూర్ నిర్మించగా ఖాకి ఫేమ్ వినోత్ తెరకెక్కించాడు. మరి ఇప్పుడు తెలుగు లో రీమేక్ లో అవుతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.