వరుస పరాజయాల తరువాత ఇటీవల చిత్రలహరి తో విజయాన్ని అందుకున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈచిత్రం తరువాత ఆయన , ప్రతిరోజూ పండగే తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వచ్చే వారం విడుదలకానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం బస్ యాత్రను నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకొని సినిమా పై అంచనాలను పెంచేసింది.
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నాడు. సినిమా లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా తేజూ తన బాడీ ని చూపించనున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమిళ నటుడు సత్యరాజ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ చిత్రం తో తేజూ వరుసగా రెండో విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.
ఇక సాయి ధరమ్ ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఈసినిమా తో పాటు సాయి ధరమ్ .. ప్రస్థానం ఫేమ్ దేవాకట్టా తో కూడా సినిమా చేయనున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లో ప్రారంభం కానుంది.