తాజా చిత్రంలోని విశేషాలను పంచుకున్న కార్తీ
రచయిత రెన్సిల్ డిసిల్వ ఇంతకముందు ‘రంగ్ దే బసంతి’ రాసినవారు ఆయన ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. ఈ కథ నాకు బాగా నచ్చింది.అంతేకాకుండా వదిన(జ్యోతిక) కూడా ఈ కథ విన్నారు. దర్శకుడు ఎవరు? అని అనుకుంటుంటే.. జీతూ జోసెఫ్ కరెక్ట్ అని అనుకున్నాం. నేనూ, వదినా ఈ సినిమా చేయబోతున్నాం అని తెలిసి ఆయన కూడా ఓకే అన్నారు. ఈ స్క్రిప్ట్ ఆయనకి బాగా నచ్చడంతో మాకు మరింత నమ్మకం వచ్చింది.
ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టే వదినతో యాక్ట్ చేయడం ఉండేది. ఎందుకంటే ఈ సినిమాలో మా పాత్రలు కూడా అలానే ఉంటాయి. ఈ చిత్రంలో మేమిద్దరం అక్కాతమ్ముడి పాత్రల్లో నటించాం. డైలాగ్స్ అన్నీ నెల రోజుల ముందే నేర్చుకుని సెట్కి వచ్చేవారు వదినఅని కార్తీ చెప్పారు .అన్నయ్య(సూర్య) ఇంకా ఈ సినిమాను చూడలేదు.ఆయన థియేటర్స్లోనే చూస్తా అని చెప్పారు.ఇందులో మా తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించారు ,మా బామ్మ పాత్ర . ‘షావుకారు’ జానకి చేశారు. ఇంతమంది అద్భుతమైన నటీ నటులతో పని చేసినప్పుడు మనం కూడా బాగా చేస్తాం. చాలా నేర్చుకుంటాం అని కార్తీ పేర్కొన్నారు .
‘ఖైదీ’ నా గత చిత్రం చిరంజీవిగారి సినిమా టైటిలే. ఈ సినిమా టైటిల్ కూడా చిరంజీవిగారిదే ఆయన కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేశారని నాతో ఎవరో అన్నారు. మంచి శకునం అనుకున్నాను.ప్రస్తుతం థాయ్ల్యాండ్లో మణిరత్నంగారి ‘పొన్నియిన్ సెల్వమ్’ షూటింగ్ జరుగుతోంది. ‘దొంగ’ ప్రమోషన్స్ కోసం చిన్న బ్రేక్ తీసుకొని వచ్చాను. మళ్లీ వెళ్లి షూటిం గ్లో జాయిన్ అవుతాను.