ఆరు వరుస డిజాస్టర్ల తరువాత ఈఏడాది సమ్మర్ లో చిత్రలహరి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎట్టకేలకు డీసెంట్ హిట్ కొట్టాడు మెగా హీరో సాయి తేజ్. ఇక ఈ చిత్రం తరువాత అతను మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజూ పండగే లోనటించాడు. నిన్న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఇక మొదటి రోజు ఈచిత్రం కలెక్షన్ల పరంగా షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా కేవలం 3కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. అయితే టాక్ పాజిటివ్ గా వుండండతో ఈ రోజు ర, రేపు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశాలు వున్నాయి. ముఖ్యంగా మార్నింగ్ షోస్ ఫుల్ కాకపోవడమే ఓపెనింగ్ తక్కువ రావడానికి కారణంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం డీసెంట్ వసూళ్లను రాబడుతుందని సమాచారం.
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ హైలైట్ అవ్వగా యావరేజ్ సెకండ్ హాఫ్ సినిమా ఫలితం పై ప్రభావం చూపించనుంది. ఈచిత్రం లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇక సాయి ధరమ్ ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.