డేటింగ్ కి ఒకేసారి రమ్మన్నారు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఈ మద్య డేటింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పాశ్చాత్య నాగరికతగా ఉండే ఈ డేటింగ్ ఇప్పుడు అన్ని దేశాలకు పాకింది. భారత దేశంలో గతంలో బాలీవుడ్ లో ఎక్కువగా డేటింగ్ (సహజీవనం) కల్చర్ కొనసాగింది. ఆ తర్వాత అన్ని సినీ పరిశ్రమల్లోకి ఇది వచ్చేసింది. పెళ్లి కాకుండానే ఇష్టపడ్డవారు కలిసి జీవనం సాగించడం.. ఇష్టపడి పెళ్లి చేసుకునే వారు ఉన్నారు.. కాదని విడిపోయిన వారు ఉన్నారు. డేటింగ్ తో కలిసి చాలా కాలం బతికిన వారు అభిప్రాయ భేదాలతో విడిపోతున్నారు. ఈ కల్చర్ ఇప్పుడు సెలబ్రెటీలకే కాదు సామాన్యులకు కూడా అంటుకుంది. చాలా మంది యువత ఇప్పుడు డేటింగ్ కల్చర్ కొనసాగిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో సంచలన తార రాధికా ఆప్టే గురించి తెలియని వారు ఉండరు. చేసింది తక్కువ సినిమాలే అయినా జాతీయ స్థాయిలో ఈ నటికి గుర్తింపు ఉంది.
తెలుగు లో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, బాలకృష్ణ నటించిన లెజెండ్, లయన్ మూవీలో నటించింది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మద్య తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు హీరోలు హీరోయిజం మాత్రమే చూపిస్తారని.. హీరోయిన్లను పాటలకు మాత్రమే పరిమితం చేస్తారని కామెంట్ చేసింది. ఇక పెళ్లయ్యాక కొన్ని సన్నివేశాలకు హీరోయిన్లు నో చెప్పేస్తుంటారు. కానీ నటి రాధికా ఆప్టే అలా కాదు.
పెళ్లయ్యాకే ఆమె సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఏ హీరోయిన్ ధైర్యం చేయలేని సీన్లలో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనెప్పుడూ నాకంటే చిన్న వయసు వాళ్లతో డేటింగ్ చేయలేదు. అయితే పెళ్లికి ముందు ఇద్దరు అబ్బాయిలు తమతో డేటింగ్ కి వస్తావా అని ఒకేసారి ప్రపోజ్ చేశారని చెప్పింది. వారిలో నా భర్త బెనెడిక్ట్ ఒకరు. అప్పుడు నేను కన్ఫ్యూజ్ లో పడిపోయాను.. దాంతో ఒక ఐడియా వచ్చింది. నేను టూనా చేపను వండి మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టా. ఒకవేళ ఆ పిల్ల నేను వండిన టూనా చేపను తింటే బెనెడిక్ట్తో డేటింగ్కి వెళ్లాలని తినకపోతే మరో కుర్రాడితో డేటింగ్కి వెళ్లాలని నిర్ణయించుకున్నా. మొత్తానికి చేపను పిల్లి తినడం.. బెనెడిక్ట్తో డేటింగ్కి వెళ్లడం జరిగింది. ఇప్పుడు నేను ఆయన్నే పెళ్లి చేసుకున్నాను