‘దర్బార్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు మూహుర్తం పెట్టేసిన చిత్రబృందం.. ఎప్పుడో తెలుసా.. !!
విలక్షణమైన నటనతో అశేష ప్రేక్షకుల అభిమానం చూరగొన్న సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ‘గజిని’, ‘స్టాలిన్’, ‘తుపాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, ఉన్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది.. ఇక ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో రజినీ సరసన నయనతార నటిస్తుండగా కీర్తి సురేశ్తో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జనవరి 9న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అదీగాక రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే జనవరి 3న హైదరాబాద్లో దర్బార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.
దర్బార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు రజనీకాంత్ సహా చిత్రబృందం అంతా హాజరు కానున్నారని పేర్కొన్నారు.. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ రికార్డులు సృష్టిస్తుండగా. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్గా రజనీకాంత్ స్టైల్, గ్రేస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోందని అభిమానులు మురిసిపోతున్నారు.. అదీ కాకుండా ఈ ట్రైలర్లో రజనీకాంత్ మేనరిజమ్స్, యాక్టింగ్, స్టైల్, మురుగదాస్ టేకింగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి..
ఇక రజనీ గత చిత్రాలకంటే భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ సినిమాతో రజనీ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడం ఖాయమంటున్నారు కొందరు. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్నారు..