సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఈరోజు భారీ అంచనాలతో విడుదలకాగా ప్రీమియర్స్ , ఎర్లీ మార్నింగ్ షోస్ నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కేవలం మహేష్ ను ద్రుష్టిలో పెట్టుకొని అతని ఫ్యాన్స్ తనను ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎలాంటి మెసేజ్ లేకుండా పక్కా మాస్ మాసాల కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమాను తీర్చిదిద్దాడు. సినిమా అంత మహేష్ వన్ మ్యాన్ షో చేశాడు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో మునుపటి సినిమాల్లో కన్నా మరింత అందంగా కనిపించి అదరగొట్టాడు. ఎన్నడూ లేని విధంగా ఈసారి డ్యాన్స్ లోకూడా తన ట్యాలెంట్ చూపించాడు. వీటితోపాటు ఇంటర్వెల్ బ్లాక్ , మహేష్ - ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశాలు సినిమాను కాపాడాయి.
ఇక మైనస్ ల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ రష్మిక మందన్న గురించే.. గీత గోవిందం , డియర్ కామ్రేడ్ లో మంచి పాత్రలను దక్కించుకొని ఆకట్టుకున్న రష్మిక, సరిలేరు నీకెవ్వరు లో మాత్రం దారుణంగా తేలిపోయింది. ఏమాత్రం స్కోప్ లేని క్యారెక్టర్... దానికి తోడు ఓవర్ యాక్టింగ్ తో చిరాకు తెప్పించింది. కేవలం మహేష్ పక్కన నటించాలనే కోరిక తోనే రష్మిక ఈసినిమా కు ఒప్పుకుంది. నటన విషయంలోనే కాదు గ్లామర్ లోకూడా తేలిపోయింది. వీటితో పాటు బలవంతంగా ఇరికించిన కామెడీ , క్లైమ్యాక్స్ సినిమా ఫ్లో ను దెబ్బతిశాయి. ఓవరాల్ గా సాలిడ్ స్టోరీ లేకుండా వచ్చిన ఈ చిత్రం మహేష్ మ్యాజిక్ వల్ల బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేలానే కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర , దిల్ రాజు , మహేష్ బాబు నిర్మించారు.