`సరిలేరు నీకెవ్వరూ` ఫస్ట్ డే కలెక్షన్స్.. మహేష్ జోరు మామూలుగా లేదుగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మహేష్ కెరీర్లో అత్యుత్తమ చిత్రంగా భావిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనే విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అయింది. ఇక వరుస హిట్స్తో జోరుమీదున్న అనిల్ ఈ సినిమాను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా మలిచాడు.
దీంతో మొదటి షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర అలరిస్తోంది. ఈ సినిమాలో ముఖ్యంగా అనిల్ తన బలమైన కామెడీని మిస్ చేయకుండా.. అప్పుడప్పుడూ యాక్షన్ సీన్స్తో.. కావాల్సినప్పుడల్లా తగినమోతాదులో సెంటిమెంట్ డ్రామాతో సినిమాను ఎంగెేజింగ్గా తీశాడు. దీంతో అసలే సినిమాలు లేక సరైన ఎంటర్టైనర్ కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తెగనచ్చేసిందని చెప్పోచ్చు. దీంతో నైజాంలో మొదటిరోజు సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో 8.66 కోట్ల షేర్ రాబట్టింది. ఈ కలెక్షన్స్ మహేష్ కెరీర్ లోనే బెస్ట్ నైజాం ఫస్ట్ డే ఓపెనింగ్గా నిలిచాయి.
అయితే నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ రూపంలో.. ప్రభాస్ సాహో మొదటి స్థానంలో ఉండగా… బాహుబలి 2, సైరా తరువాత రెండు స్థానాల్లో ఉన్నాయి. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని విడుదలైన సరిలేరు నీకెవ్వరు రానున్న రోజులలో మరిన్ని మెరుగైన కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్షనల్ ఎబిలిటీస్ ఓ ఎత్తైతే.. మహేష్, రష్మిక మందనలు తమ వంతుగా సినిమాకు కావాల్సినంత గ్లామర్ తెచ్చారు. మరో కీలక పాత్రలో విజయశాంతి నటించి సినిమాకు ఎస్సెట్గా నిలిచారు.
‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ బాక్స్ ఆఫీస్ కలెక్షన్:
నైజాం- 8.66 కోట్లు
సీడెడ్- 4.15 కోట్లు
గుంటూరు- 5.15 కోట్లు
ఉత్తరాంధ్ర- 4.4 కోట్లు
తూర్పు గోదావరి- 3.35 కోట్లు
పశ్చిమ గోదావరి- 2.75 కోట్లు
కృష్ణా- 3.07 కోట్లు
నెల్లూరు- 1.27కోట్లు
--------------------------------------------------
ఫస్ట్ డే మొత్తం షేర్- 32.77 కోట్లు
--------------------------------------------------