ఈసంక్రాంతికి ఇప్పటి వరకు మూడు సినిమాలు విడుదల కాగా ఆ మూడు అదరగొడుతున్నాయి. అందులో మొదటగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ ఈనెల 9న విడుదలై డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 150కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు లో కూడా మొదటి రెండు రోజులు భారీ వసూళ్లను రాబట్టినా ప్రస్తుతం నెమ్మదించింది. ఇక ఈ చిత్రం యూఎస్ఏ లో 5రోజుల్లో 10.11కోట్ల వసూళ్లను రాబట్టింది.
రెండోది.. సూపర్ స్థార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఈనెల 11న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 55కోట్ల షేర్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది. అలాగే యూఎస్ఏ లో ఈ చిత్రం 3రోజుల్లో 11.51కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. రేపటి తో ఈచిత్రం అక్కడ 2మిలియన్ క్లబ్ లో చేరనుంది.
ఇక మూడో చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల ... వైకుంఠపురములో.. నిన్న విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్ తో మొదటి రోజు 85కోట్ల గ్రాస్ వసూళ్లతో కలెక్షన్ల సునామీని సృష్టించిందని చిత్ర నిర్మాతలు పోస్టర్ విడుదలచేశారు. అయితే మొదటి రోజే 85 కోట్లు అంటే ఎవరికి నమ్మకం కలుగడం లేదు కాకపోతే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ఇక యూఎస్ఏ లో ఈ చిత్రం రెండు రోజుల్లోనే 9.92కోట్ల వసూళ్లను రాబట్టింది. తద్వారా ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ భారీ లాభాలను తీసుకరావడం ఖాయంగా కనిపిస్తుంది.