బాలీవుడ్ లో ఘన విజయం సాధించి ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైన అందదున్ ను సౌత్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈసినిమా తమిళ రీమేక్ హక్కులను సీనియర్ హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ సొంతం చేసుకున్నాడు. ప్రశాంత్ హీరోగా తెరకెక్కనున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక అందదున్ తెలుగు రీమేక్ హక్కులను యువ హీరో నితిన్ దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశాడట నితిన్. స్వామి రారా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సుధీర్ స్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడట.
అయితే నితిన్ ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమా లతో బిజీ గా వున్నాడు. అందులో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'భీష్మ' ఒకటి. ఈచిత్రం షూటింగ్ దాదాపు గా పూర్తి కావొచ్చింది. ఈ సినిమాతో పాటు నితిన్, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో 'రంగే దే' లో నటిస్తున్నాడు. ఈ రెండు కాకుండా సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఇవి గాక చల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో పవర్ పెట్ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవ్వన్నీ పూర్తి చేసిన తరువాత నితిన్ అందదున్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఆ లెక్కన ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.