పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలా?
మరో దర్శకుడు క్రిష్తో సినిమాకి కూడా పవన్ ఓకే చెప్పారు. ఆ సినిమాను కూడా పింక్ తో పాటు సమాంతరంగా చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఆయన ఒకేసారి రెండు సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే ఇక పవన్ ఫ్యాన్స్కి పండగ మాములుగా ఉండదు. ఇక పవన్ ఈ రెండు సినిమాలకు షెడ్యూల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. పది రోజులు దిల్రాజు సినిమాకి ఇస్తే మరో పది రోజులు క్రిష్ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ టెన్షన్లో రాజకీయాలకు కొంత గ్యాప్ ఇస్తారు.
అయితే ఈ సినిమాలకు గాను పవన్ దిల్ రాజు దగ్గర 50 కోట్ల రెమ్యునరేషన్, లాభాల్లో కొంత శాతం వాటా తీసుకోబోతున్నారు. అది ఎంత అన్నది మాత్రం వారిద్దరికే తెలుసు. అయితే క్రిష్-ఎఎమ్ రత్నం సినిమాకు మాత్రం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నారు. అంటే 2020 లో పవన్ కు రూ.100 కోట్ల ఆదాయం ఉంటుందని చెబుతున్నారు.పింక్ రీ మేక్ లో పవన్ రెండు మూడు ఫైట్లు కూడా చేస్తారని తెలుస్తోంది.