నా పేరు సూర్య ఇచ్చిన షాక్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో సినిమా ఒప్పుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. దాంతో గత ఏడాది అతను ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులముందుకు రాలేకపోయాడు. అయితే ఈ సారి మాత్రం కొడితే గట్టిగా కొట్టాలనే పట్టుదలతో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అదే అల.. వైకుంఠపురములో ... ఇక షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే సినిమా ప్లాప్ అవ్వుద్ది అంటూ భారీ ఎత్తున్న ప్రచారం జరిగింది. అయినా అల టీం మాత్రం ఆవార్తలను పట్టించుకోకుండా ఫుల్ కాన్ఫిడెంట్ తో షూటింగ్ ను పూర్తి చేసింది. మధ్యలో విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ కావడం తో ఆ కాన్ఫిడెంట్ డబుల్ అయ్యింది.
ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య మొన్న విడుదలైన ఈచిత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానికి తోడు బుక్ మై షో లో 85% రేటింగ్ తో టాప్ లో కొనసాగుతుంది. ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి. పైగా స్టార్ హీరో సినిమా కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉంటాయి. అయితే ఈ విషయం లోనే అల.. టీం ఓవర్ చేసింది. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 85కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని నిన్న ఓ పోస్టర్ విడుదలచేసింది. ఆ పోస్టర్ ను చూసిన నెటిజన్లు నిర్మాతల పై ఫైర్ అవుతున్నారు. తప్పడు కలెక్షన్స్ తో ఎందుకు జనాలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దాంట్లోనే నిజం లేకపోలేదు. 85కోట్ల గ్రాస్ రావడానికి అల.. పాన్ ఇండియా సినిమా కాదు తెలుగు తోపాటు మళయాలం లో మాత్రమే విడుదలైయింది. మలయాళ మార్కెట్ చాలా చిన్నది. సో వస్తే తెలుగులోనే రావాలి. పోనీ తెలుగులో సోలో రిలీజ్ ఆ అంట అదీలేదు. ఈసినిమా కన్నా ఒక్క రోజు ముందే సరిలేరు నీకెవ్వరు విడుదలైయింది. అది కూడా పెద్ద సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం థియేటర్లలను ఈ రెండు సినిమాలే ఆక్రమించుకున్నాయి. ఇంకా చెప్పాలంటే అల .. కంటే సరిలేరుకే ఎక్కువ థియేటర్లు దొరికాయి. మరి అలాంటప్పుడు ఇంత భారీ వసూళ్లు ఎలా సాధ్యమవుతాయి అనేది సగటు సినీ అభిమాని ప్రశ్న.. సినిమా ఎలాగూ బాగుందని టాక్ వచ్చింది. కాబట్టి ఉహించినదానికంటే ఫుల్ రన్ లో భారీ వసూళ్లనే రాబడుతుంది. మరి అలాంటప్పుడు ఈ ఫేక్ కలెక్షన్స్ ఎందుకో..