మెగా కోడలు ఉపాసన.. అత్తగారిపై ఆసక్తికర వ్యాఖ్యలు..
మెగా కోడలైన ఉపాసన కొణిదెల.. ఓ బిజినెస్ ఉమన్గా, సామాజిక వేత్తగా, చిరంజీవి కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె సోషల్మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. మరోవైపు అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ కెరీర్ పరంగా అంచలంచలుగా ఎదుగుతున్నారు. అంతేకాకుండా.. పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు.
అంతేకాకుండా.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మెగా కోడలు ఉపాసన అత్తగారి సురేఖపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..
తాజాగా సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోటు చేరి ఎంజాయ్ చేశారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అందరు యువ హీరోలు హాజరయ్యారు. మరోవైపు చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంక్రాంతిని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోను ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అత్తమ్మ సురేఖ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింటి. అవేంటంటే.. తనకు అత్తమ్మ సురేఖ ప్రతి విషయంలో ఎంతో సహాయ సహాకారాలు అందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మరియు ఎన్నో విషయాలు తెలియచేస్తారని, ఎంతో ప్రోత్సాహంగా ఉంటారని తెలిపింది ఉపాసన కొణిదెల. మొత్తంగా ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను.. అలాంటి ఉమ్మడి కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించడం విశేషం అని చెప్పాలి.