సాహో సెట్స్ మీద ఉండగానే రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది మరో సినిమా కు ఓకే చెప్పడం వెంటనే ఆసినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అయ్యారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆతరువాత సాహో విడుదలై అది కాస్త డిజాస్టర్ అయ్యింది అయినా కూడా ఇంకో సినిమా సెట్స్ మీద వుంది కదా వచ్చే ఏడాది ఆ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ ఏడాది ప్రభాస్ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
సాహో ఇచ్చిన షాక్ తో ప్రభాస్ సెట్స్ మీద వున్న తన కొత్త సినిమా షూటింగ్ కు ఏకంగా 6నెలలు బ్రేక్ ఇచ్చాడు. ఎట్టకేలకు నిన్న షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దాంతో ఈసినిమా ఈ ఏడాది చివర్లో పూర్తి కానుందట. వచ్చే ఏడాదే ఈ సినిమా విడుదలవుతుందని అంటున్నారు. ఇక ఇది చాలదు అన్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ ను తాజాగా మరో విషయం కూడా కలవరపెడుతుంది. అదేంటంటే ప్రభాస్ 20వ సినిమాలో అతని పెదనాన్నకృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇంతకుముందు ప్రభాస్ నటించిన బిల్లా,రెబల్ లో కృష్ణం రాజు కీలక పాత్రల్లో కనిపించగా ఆరెండు సినిమా ల పరిస్థితి ఏమైందో తెలిసిందే. దాంతో ఇప్పుడు ఈకొత్త సినిమా కూడా అదే సెంటిమెంట్ పనిచేస్తే ఎలా అని అభిమానులు కలవర పడుతున్నారు.
ఇదిలావుంటే ఈచిత్రానికి జాన్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ముందు నుండి వార్తలు వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం మేకర్స్ వేరే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం తెలుగు తోపాటు ,హిందీ , తమిళ భాషల్లో విడుదలకానుంది.