పల్లెటూళ్లో రేణు దేశాయ్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్

Murali

పల్లెటూళ్లంటే అందరికీ ఇష్టమే. పచ్చటి వాతావరణం, పల్లె లోగిళ్లు, స్వచ్ఛమైన గాలి, గ్రామ ప్రజల ఆప్యాయత.. ఇలా పల్లెటూరి అందాలకు కాదేదీ అనర్హం అన్నట్టు ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పల్లెటూళ్లలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. పల్లెటూళ్లో ఇంత ఆనందం ఉంటుందా.. ఇలాంటి రోజులు గడపడానికి ఇకపై సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చారు.

 

 

ఇటివల రేణు దేశాయ్ ఓ సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చెక్ చేసుకుని హైదరాబాద్ తిరిగొస్తూండగా ఓ పల్లెటూరు ఆమెను ఆకర్షించింది. అక్కడ ఆగి ఆమె అందాలను ఆస్వాదించి తిరిగి బయలదేరుతూండగా ఆమె ప్రయాణిస్తున్న కారు పంక్చర్ కావడంతో ఆమె అక్కడే కాసేపు ఉండిపోయి గ్రామస్థులతో కలిసిపోయారు. అక్కడ ఆమె అనుభవించిన పల్లె వాతావరణాన్ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘పల్లెటూళ్లలో ఆనందం ఇంత బాగుంటుందనుకోలేదు. ఇక్కడి ప్రజలు ఎంతో మంచి మనసుతో ఉన్నారు. వారి వద్ద మంచి ఆహారం ఉంది. మాకు ఉప్మా, టీ ఇచ్చారు. మన దగ్గర ఉన్నదాంట్లో కొంత ఇవ్వటానికి ఆలోచించే మనుషుల మధ్య వీరి ఆప్యాయత నన్ను ఎంతో ఆకట్టుకుంది. నా కార్ టైర్ పంక్చర్ కావడం వల్లే ఈ అనుభూతి పొందగలిగాను. ఇలాంటి వాతావరణంలోకి తీసుకొచ్చిన నా ప్రొడక్షన్ డిజైనర్ ని మెచ్చుకోకుండా ఉండలేను’ అని తన వాల్ లో రాసుకుంది.

 

 

ఆ గ్రామం పేరు తెలపకపోయినా.. అక్కడ చలి కాచుకుంటూ, చిన్న పిల్లలతో అల్లరి, గ్రామస్థులతో సంభాషణ చేస్తున్న ఆమె పిక్స్ ను కూడా పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. . ఆనందాలకు, ప్రశాంతతగా పల్లెటూళ్లను మాత్రమే ఉదాహరణగా చెప్పుకుంటాం. అందుకు సామాన్య ప్రజల నుంచీ సెలబ్రిటీల వరకూ అందరికీ ఇదే అభిప్రాయం.. అనుభూతి కలుగుతుంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
. Last night was a wish that just came true because I wished for it from the honest depths of my heart! This was the last {{RelevantDataTitle}}